హైదరాబాద్ : పంజాగుట్ట నిమ్స్లో ఇవాళ ఓ రోగికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నారు. మలక్పేట యశోద ఆస్పత్రి నుంచి నిమ్స్కు బుధవారం ఉదయం గ్రీన్ చానెల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్లో గుండెను తరలించారు. ప్రమాదంలో గాయపడి.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండెను సేకరించారు.
ఈ నెల 12వ తేదీన గొల్లగూడెం వద్ద కానిస్టేబుల్ వీరబాబు రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపుతప్పి వీరబాబు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వీరబాబు బ్రెయిన్ డెడ్కు గురైనట్లు నిన్న యశోద వైద్యులు ప్రకటించారు. కానిస్టేబుల్ గుండె దానానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. గుండె కోసం జీవన్దాన్లో 30 ఏండ్ల వయసున్న ఓ పెయింటర్ నమోదు చేసుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ గుండెను ఆ పెయింటర్కు నిమ్స్ వైద్యులు ఇవాళ అమర్చనున్నారు. నిమ్స్లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి.