బొల్లారం,ఆగస్టు 15 : అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, మెరుగైన పరిజ్ఞానం కలిగిన వైద్యులతో ఓజోన్ దవాఖాన ప్రారంభించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. ఆదివారం బొల్లారం రైతు బజార్ ఎదురుగా ఓజోన్ దవాఖాన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యాపార థృక్పథంతో కాకుండా సేవా భావంతో వైద్యం అందించాలని సూచించారు.
సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లోనే నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైధ్యాధికారి మల్లికార్జున్, ప్రభుత్వ ఛీప్ ఆపరేటింగ్ అధికారి శ్రీనివాస్ శ్రీరాముల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.