హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్కోసం పార్క్కుకి వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారు 108కి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపే అతడు మృతి. మరణించిన వ్యక్తిని కానిస్టేబుల్ సూర్యనారాయణగా గుర్తించారు. ఆయన సీఆర్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.