హైదరాబాద్: రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 262 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 11 ప్రిన్సిపాల్, ఆరు వైస్ ప్రిన్సిపాల్, 77 పీజీటీ, 168 టీజీటీ పోస్టులను నింపనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మొత్తం 3479 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 262
అర్హతలు: ప్రిన్సిపాల్ పోస్టులకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లేదా టీచింగ్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30
పరీక్ష తేదీ: జూన్ మొదటి వారం
వెబ్సైట్: http://telanganaemrs.in, https://tribal. nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..