బాలానగర్, జూన్ 27 : గంజాయి నుంచి తీసిన నూనె (హషీష్ ఆయిల్)ను విక్రయిస్తున్న ఆరుగురిని బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 296 గ్రాముల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ సీఐ జీవన్కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ రాజుకాలనీలో నివాసముండే వినయ్.. గంజాయి నుంచి తీసిన హషీష్ ఆయిల్ను విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టి వినయ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మాదాపూర్, మణికొండ ప్రాంతాల్లోని హోటళ్లలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఆ ఆయిల్ను సరఫరా చేస్తుండగా.. నేను విక్రయిస్తున్నానని చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ హోటళ్లపై దాడిచేసి జ్ఞానేశ్రెడ్డి, నరేశ్,లోకేశ్, శివ , విశాల్లను అదుపులోకి తీసుకున్నారు. వినయ్ నుంచి 1 ప్యాకెట్, ఆ ఐదుగురు నుంచి 32 డబ్బాలు.. మొత్తం 296 గ్రాముల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సీఐ, ఎస్సైలు మహేందర్, శ్యాం సుందర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.