శంషాబాద్, అక్టోబర్ 8: ప్రకృతి రమణీయతకు నిలయంగా ఆకట్టుకునే మొక్కలు.. అందమైన పూల సుగంధ పరిమళాలతో మనస్సును దోచే పచ్చని వాతావరణంతో పర్యాటకులను శంషాబాద్ పంచవటి పార్క్ ఆకట్టుకుంటున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలతో నగర శివారు అర్బన్ అడవుల సుందరీకరణ దిశగా శంషాబాద్ పరిధిలోని కొత్వాల్గూడలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన అర్బన్ లంగ్ స్పేస్ ‘పంచవటి’ పార్క్ నిర్మించారు.
2016లో దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2.17 కోట్ల వ్యయంతో మూడేండ్ల పాటు శ్రమించి పార్క్ నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో పంచవటి, పర్ణశాల, నక్షత్రవనం, మూలికావనం, నవగ్రహవనం, మెడిసినల్ గార్డెన్, రాశి వనంతో పాటు దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల ట్రాక్ వాకింగ్ ఏర్పాటు చేశారు. ప్రకృతి సహజసిద్ధమైన వాతావరణం కోసం నిర్మించిన ఈ పార్క్ శంషాబాద్ ప్రాంత ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మియాపూర్ : ప్రభుత్వం హరిత నిధి పథకాన్ని ఏర్పాటు చేసింది. పచ్చదనం పెంపుకోసం అందరి భాగస్వామ్యం కోరింది. పచ్చదనం ఉంటేనే వానలు కురుస్తాయి. పంటలు పండుతాయి. భవిష్యత్ తరాలు బాగుంటాయి. ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ వహించి పచ్చదనం పెంపును ఒక ఉద్యమంలా చేపడుతున్నది. హరితహారం మంచి ఫలితాలనిస్తున్నది. పచ్చదనం కోసం ప్రభుత్వం ఇచ్చిన పిలుపును బాధ్యతగా స్వీకరించాలి. – వెంకటేశ్వర్లు, డీసీపీ మాదాపూర్
1.అశ్విని-విషముష్టి, 2.భరణి- పిలందస్ ఎంబిలికా, 3. కృతిక-అత్తిచెట్టు, 4. రోహిణి- కుమిని, 5. మార్గశిర-అకేసియా, 6.ఆరుద్ర-అగర్చెక్క, 7. పునర్వసు-వెదురుకర్ర, 8.పుష్య-రావి, 9.అశ్లేష- చం పాపుష్పం, 10.మాఘ-మర్రిచెట్టు, 11.పూర్వఫాల్గుణి- అడవిజ్వాల, 12. ఉత్తర ఫాల్గుణి-గన్నేరు. 13.హస్త-జాస్మిన్, 14.చిత్ర-బెంగాల్ క్విన్స్, 15. విశాఖ-ఉడ్ ఆపిల్, 16.స్వాతి-అర్జున్ ట్రీ, 17.అనురాధ- మౌల్సారి, 18.జయహస్త-సిల్క్ కాటన్ చెట్టు, 19. మూల-శోరియా రోబుస్ట్రా, 20.పూర్వాషాడ-చెరకు, 21.ఉత్తరాషాడ-పనస, 22. శ్రావణ-కోయిలమొటిమ, 23.ధనిష్ట-స్పంగ్, 24.శతబిష-కదంబ, 25. పూర్వా భాద్రపద -మామిడి, 26.ఉత్తరా భాద్రపద- భారత లిలక్,27. రేవతి-ఎల్లోప చెట్టు.
ఇక్కడ సీతాకోకచిలుకల వనం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ పార్కులో వివిధ రకాల పూల మొక్కల చెట్లను పెంచారు. ఈ పూల వనంలో రంగురంగుల సీతాకోకచిలుకలు తిరుగుతూ సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.
నగర జీవితంతో విసిగి.. సేద తీరేందుకు ఉబలాటపడే ప్రకృతి ప్రేమికులకు ఇక్కడ అనంతమైన పచ్చదనం లభిస్తుంది. మార్నింగ్ వాక్ చేసేవారికి, సందర్శకులకు, వీకెండ్ పర్యాటకులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.5 టికెట్తో అనుమతిస్తున్నారు. ఆరంభంలో అంతగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం సగటున రోజూ 150 నుంచి 200 మంది వస్తున్నారు. ఇక్కడ రెండు తెలుగు రాష్ర్టాల అడవులతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి తీసుకువచ్చిన అరుదైన మొక్కలు లభిస్తున్నాయి. రాష్ట్రంలో నిర్వహిస్తున్న హరితహారానికి కూడా ఇక్కడి నుంచి ఇప్పటి వరకు సుమారు 40 వేల మొక్కలు తీసుకువెళ్లారు. ఈ పార్కులో దాదాపు 2 లక్షల మొక్కలను పెంచుతున్నారు.
ఈ పార్కులో నక్షత్రాలు, రాసులు, గ్రహాలకు సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి. హరితహారం ప్రారంభం నాటి నుంచి పలు ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి తమతమ రాసులు, నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను తీసుకువెళ్తున్నారు.
పహాడీషరీఫ్ :ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలి. మున్సిపల్ సిబ్బంది ప్రధాన రోడ్ల మధ్య, కాలనీల్లో, మసీదుల వద్ద, పాఠశాలల్లో, శ్మశాన వాటికల్లో వేప, కానుగ, నేరేడు మొక్కలను నాటుతున్నారు. మొక్కలు జీవకోటికి ఆధారం. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మన మంచి కోసమే చెబుతున్నారు. మొక్కలు నాటి సంరక్షిద్దాం. – అసద్, మినార్కాలనీవాసి
పహాడీషరీఫ్: సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. మొక్కలు నాటితే కాలుష్యం తగ్గుతుంది. స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. మన ఇంటి పరిసరాలు పచ్చగా ఉంటాయి. మొక్కలు చెట్లుగా మారిన తర్వాత చల్లటి నీడనిస్తాయి. – నయూంఖాన్, తూర్కాలనీవాసి
కందుకూరు : పోలీస్ స్టేషన్కు వచ్చేవారికి మం చి వాతావరణం ఉండేలా స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాం. పచ్చదనంతో కాలుష్యాన్ని దూరం చేయవచ్చు. ప్రకృతి బాగుండాలంటే పచ్చదనం అవసరం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి. భవిష్యత్ తరాలకు మనమిచ్చే బహుమతి పచ్చదనమే. సీఎం కేసీఆర్ పచ్చదనాన్ని పెంచేందుకు హరితనిధి ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. అందరినీ భాగస్వాములను చేయడం ఆనందంగా ఉంది.- లిక్కి కృష్ణంరాజు, సీఐ కందుకూరు పీఎస్