కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్పై బుధవారం దాడి జరిగింది. కూచ్ బెహార్లోని సిటల్కుచి ప్రాంతంలో ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. సమీపంలో సీఎం మమత నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తున్నది.
ఈ సందర్భంగా టీఎంసీ గూండాలు తనతోపాటు బీజేపీ కార్యకర్తలపై నాటు బాంబులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారని దిలీప్ ఘోష్ ఆరోపించారు. ఈ ఘటనలో తన కారు అద్దాలు ధ్వంసం కావడంతోపాటు తనకు దెబ్బలు తగిలినట్లు ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం దయనీయంగా ఉన్నదని, పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు.
మరోవైపు బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. ఈ దాడిలో తమ కార్యకర్తల ప్రమేయం లేదని పేర్కొంది.