ఆన్లైన్లో తరగతులు
ఆసక్తి చూపుతున్న ఔత్సాహికులు
కమాన్చౌరస్తా, మే 17 : జవహార్ బాల కేంద్రం ఆధ్వర్యంలో ఏటా వేసవిలో నిర్వహించే శిక్షణ తరగతులను ఈ యేడు కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కొనసాగిస్తున్నారు. తర్ఫీదు పొం దేం దుకు చిన్నారులు ఆసక్తి కనబరుస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇండ్లలో ఉంటున్న చిన్నారులు తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో ఆ న్లైన్ ద్వారా సంగీతం, జానపద నృత్యం, చిత్రలేఖనం, తబలా, క్రాఫ్ట్ అంశాల్లో శిక్షణ ఇస్తుండగా ఇప్పటి వరకు దాదాపు 200 మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు. అయితే, ఈ తరగతులు మే 10వ తేదీ నుంచి ప్రారంభంకాగా, జూన్ 10వ వరకు కొనసాగుతాయని బాలవికాసకేంద్రం సూ పరింటెండెంట్ కట్ట మంజులాదేవి పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా టీచర్లకు ఫోన్ ద్వా రా మాట్లాడిన తర్వాత, వాట్సాప్ గ్రూప్ ద్వారా లింక్ పంపుతారు. ఆ సమయంలో లింక్ ఓపెన్ చేసి విద్యార్థులు తరగతులు వినవచ్చు.
నిర్వహిస్తున్న తరగుతులు..
గాత్ర సంగీతం : కే మంజులాదేవి, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు – 90308 53951
జానపద నృత్యం : ఎస్ రాధాకృష్ణ, ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు – 98667 39569
చిత్రలేఖనం : కృష్ణకుమార్, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు – 99591 48123
మృదంగం, తబలా : కే శ్రీధర్, ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు – 99638 67874
క్రాఫ్ట్ : పీ సూర్యశ్రీ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – 90590 30473. ఆసక్తి గలవారు ఆయా నంబర్లలో సంప్రదించవచ్చు.
నెల రోజులు శిక్షణ
ఈ యేడు వేసవిలో చిన్నారుకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తు న్నాం. కరోనా నేపథ్యంలో గతేడాది తరగతులు నిర్వ హించలేదు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు తరగతులు కొనసాగిస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు అన్ని విభాగాల్లో కలిపి 200 మంది వరకు శిక్షణ పొందుతున్నారు.