కోల్కతా : బాలీవుడ్ హీరో, బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని ఇవాళ కోల్కతా పోలీసులు విచారించారు. ఇటీవల వివాదాస్పద ప్రసంగం చేసిన కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. ఇవాళ హీరో మిథున్ చక్రవర్తి 71వ పుట్టిన రోజు. అయితే ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో వివాదాస్పద ప్రసంగం చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పోలీసులు వర్చువల్ రీతిలో ఆయన్ను విచారించారు. మానిక్తాలాలో మిథున్పై ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నది. మార్చి ఏడవ తేదీన కోల్కతాలో జరిగిన ర్యాలీలో మిథున్ పాల్గొన్నారు. ఆ రోజే ఆయన పార్టీలో చేరారు. అయితే ప్రధాని మోదీ పాల్గొన్న సభలో మిథున్ మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తరపున బెంగాల్ ఎన్నికల్లో మిథున్ ప్రచారం చేపట్టారు.