మహేశ్వరం, జూలై 11 : మహేశ్వరం నియోజకవర్గంలోని కేసీ తండాకు నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాకతో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ తగిన ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆదివారం కేసీ తండా వద్ద వ్యాక్సిన్ సెంటర్లో జరుగుతున్న పనులను ఆయన తాసీల్దార్ ఆర్పీ జ్యోతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులతో కలిసి రెండో డోసు టీకా వేయించుకునేందుకు గాను ప్రజలకు వ్యాక్సినేషన్పై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి వస్తున్నారని తెలిపారు. జరుగుతున్న పనులను వివిధ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో కలిసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నర్సింహులు, ఇన్చార్జి ఎంపీవో వజ్రలింగం, సర్పంచ్ మోతీలాల్నాయక్, నాయకులు మంత్రి రాజేశ్, లక్ష్మణ్నాయక్ పాల్గొన్నారు.