సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవ్లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) ఆధ్వర్యం లో సుదర్శన్ భారత్ పరిక్రమ కార్యక్రమం ద్వారా 7,500 కిలోమీటర్ల ‘బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ’ని నిర్వహించేందుకు సంకల్పించారు. పీవీ నరసింహారావు మార్గ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ముఖ్య అతిథిగా ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ సార్వ భౌమత్వ రక్షణలో ఎన్ఎస్జీ కమాండోల పాత్ర కీలకమన్నారు. యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్లతో ఉగ్ర మూకలను తుద ముట్టిస్తూ శాంతి భద్రతలను నెలకొల్పుతున్న కమాండోల సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం, దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ – 2019 బ్యాచ్ ట్రైనీల బృందం, ఎస్ఐసీఏ అధ్యక్షుడు ఎస్.చక్రవర్తి రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. అలాగే.. ఎన్ఎంసీ సభ్యుడు, నిమ్స్ మాజీ డీన్ జి.సూర్యనారాయణ రాజును గవర్నర్ సన్మానించారు.