న్యూఢిల్లీ: దేశమంతటా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి జైళ్లపైనా తన ప్రతాపం చూపుతున్నది. దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలు కూడా కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. దాంతో అన్ని జైళ్లు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కరోనా బాధిత ఖైదీలకు చికిత్స అందిస్తున్నాయి. తీహార్ జైల్లో అయితే పరిస్థితి కొంత తీవ్రంగా ఉన్నది.
రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగడమేగాక, ఈ సెకండ్ వేవ్లో ఇప్పటివరకు నలుగురు ఖైదీలు కరోనాతో మృతిచెందారు. దాంతో తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. జైల్లో ఖదీల సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల సామాజిక దూరం అనే నిబంధనను పాటించడం సాధ్యం కావడం లేదని, కాబట్టి సాధ్యమైనంత మంది ఖైదీలను పెరోల్పై, బెయిల్పై పంపించేందుకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్పత్రికి 57 మంది సభ్యుల నేవీ వైద్య బృందం
మహారాష్ట్రలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
ఆసిఫాబాద్లో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
నెట్టుంటే.. నట్టింట్లోనే వైద్యం
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం