కాచిగూడ,ఆగస్టు 13 : నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారిని అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాడని అన్నారు. కాచిగూడలోని నింబోలిఅడ్డా జూవైనల్ హోంలో రూ.3.60 కోట్లతో 75 మంది విద్యార్థులకు సరిపడే మూడంతస్థుల నూతన భవనాన్ని నిర్మించారు.
ఈ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరిజన, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. బాలికలకు అవకాశమిస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, లేనియేడల వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచే సహనం, ఓపిక, మంచి లక్షణాలను నేర్పించాలని తెలిపారు.
సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అన్ని రంగాలు వేగంగా అభివృద్ది చెందుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, దూసరి శ్రీనివాస్గౌడ్, బాలికల సదనం సూపరింటెండెంట్ మైథిలి, లలిత, తదితకెలె పాల్గొన్నారు.