సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తేతెలంగాణ): గ్రేటర్లో నాలుగుచోట్ల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానల పనులు త్వరలో ప్రారంభించాలని ఆదివారం జరిగిన మంత్రిమండలి అధికారులను ఆదేశించింది. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి, గచ్చిబౌలి టిమ్స్ ప్రాంగణం, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్, అల్వాల్ వద్ద నాలుగు ప్రభుత్వ దవాఖానలు నిర్మించి అందుబాటులోకి తేవాలని సూచించింది. వీటితోపాటు పటాన్చెరులో కార్మికుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ప్రసుత్తం ఉస్మానియా, గాంధీ, నిమ్స్లలో సేవలందుతుండగా, కొత్తవి నాలుగు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ వైద్యం మరింత బలోపేతం కానుంది.