బంజారాహిల్స్,ఆగస్టు 23 : ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎర్రగడ్డ డివిజన్కు చెందిన మహ్మదీ బేగం అనే మహిళ చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.30వేల చెక్కును సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ..పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ, మహ్మద్ అజీముద్దీన్, జహంగీర్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుమ్మర సంఘం భవన నిర్మాణం కోసం 200 గజాల స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ ప్రజాపతి, ప్రధాన కార్యదర్శి పావనితో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు వినతిపత్రం అందజేశారు.
దీనికి ఎమ్మెల్యే మాగంటి సానుకూలంగా స్పందించడంతో పాటు ప్రభుత్వంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఉదయ్కిరణ్, నరేష్, బాస్కర్, తదితరులు పాల్గొన్నారు.