హిమాయత్నగర్,ఆగస్టు26 : ఉన్నత విద్యకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని టీ జెఎసీ కో-ఆర్డినేటర్ ఎం.వేణు అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ లింబాద్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా లింబాద్రి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్ని రకాల అభివృద్ధి, వికాసాలకు మూలమైన విద్యారంగాన్ని అత్యున్నంతగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, శివ తదితులు ఉన్నారు.