అంబర్పేట, సెప్టెంబర్ 8 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కొవిడ్ కష్టకాలంలో అందరికంటే ముందు ఉండి అపరిశుభ్ర వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉండేలా పనిచేసిన పారిశుధ్య కార్మికుల రక్షణ బాధ్యత కూడా తమదేనని పేర్కొన్నారు.
నల్లకుంట డివిజన్లోని సత్యానగర్ కమ్యూనిటీహాల్లో డివిజన్కు చెందిన పారిశుధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న మొత్తం కార్మికులు 845 మందికి ఈ కిట్లను అందిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ అమృత, ఏఎంఓహెచ్ డా.జ్యోతిబాయి, బస్తీ నాయకులు క్రాంతికుమార్, రాంచందర్, జగదీశ్, ఈశ్వర్, మహేష్, సుధాకర్, రమణనాయుడు, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, ఎర్రబోలు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.