ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. రూ.5.50 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై పంజాగుట్ట పీఎస్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెద్దపల్లి జిల్లా ము త్తారం గ్రామానికి చెందిన మామిడి ప్రవీణ్ అమీర్పేట సమీపంలోని ఆఫీసర్స్ కాలనీలో నివా సం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఎంబీఏ చదివిన ప్రవీణ్కు ఇటీవల ఆదిలాబాద్కు చెందిన కుంబాజి శ్రీకాంత్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు.. ఇందుకు రూ.5.50లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి.. ఆ డబ్బును వసూలు చేశాడు. ఉద్యోగం వచ్చిందని..పోలీస్ వెరిఫికేషన్ కోసం వస్తారంటూ నమ్మించాడు. రోజులు గడిచినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో శ్రీకాంత్కు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో బాధితుడు శనివారం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు.