కందుకూరు : తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో 15వేల నూతన కంపెనీలు ఏర్పాటు అయినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. సోమవారం మండల కేంద్రంలో గల సామ నర్సింహరెడ్డి ఫంక్షన్ హలులో రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ ఆధ్వర్యంలో జాబ్మేళను నిర్వహించారు. ఈ మేళలో 22కంపెనీలు పాల్గొని 462మందిని ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 320మంది 3నెలల శిక్షణ అనంతరం ఉద్యోగల్లో నియమిస్తారు. ఎంపికైన వారికి ఆమె నియామకపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిరుద్యోగ సమస్య తీర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రైవేట్ రంగంల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 50వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రయివేట్ రంగంలో కూడా భారీ ఎత్తున ఉద్యోగాలను నియమిస్తామని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కోసం యువతకు శిక్షణ ఇస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ఇంగ్లీష్పై పట్టులేక వెనుకబడిపోతున్న వారిని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి సంస్థలు నూతనంగా తమ బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మాసిటిలో సైతం భూములు కోల్పోయిన వారికి ఇంటికోక ఉద్యోగం ఇస్తామని వారికి ముందుగా తుక్కుగూడలో శిక్షణ ఇస్తామని తెలిపారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రైతు బంధు అద్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి,మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి,పీఎసీఎస్ అధ్యక్షుడు చంద్రశైఖర్,వైఎస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి. డీఆర్డీఎ పీడీ ప్రభాకర్, జేడీఎం హమీద్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి,డైరెక్టర్లు పొట్టి ఆనంద్ శేఖర్రెడ్డి, పారిజాతం, మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్, మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు దామోదర్గౌడ్, సామ మహేందర్రెడ్డి, గుయ్యని సామయ్య, కాకి ధశరథ,మండల క్రిష్ణ, రవికుమార్రెడ్డి, కార్తీక్, దీక్షిత్రెడ్డి, ప్రశాంత్ చారి. దేశం మోహన్రెడ్డి,బాలమణి అశోక్, జయ్యమ్మ, ఎండీఓ క్రిష్ణకుమారి, తాసిల్దారు జ్యోతి వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు.