బంజారాహిల్స్,మార్చి 8: కుటుంబ బాధ్యతలతో పాటు ఆధునిక మహిళ ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగాల్లో రాణిస్తూ తమ సత్తా చాటుకుంటుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్లోని తమ క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో పాటు పార్టీకి చెందిన మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే గోపీనాథ్ పాల్గొన్నారు. అనంతరం కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయడంతో పాటు రాజకీయా ల్లో 50శాతం రిజర్వేషన్లు మహిళలకోసం అమలు చేస్తున్నదన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్యరావు, వనం సంగీతయాదవ్, రాజ్కుమార్ పటేల్ పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, మార్చి8:బోరబండ పరిధిలోని కేఎస్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను వాసవీక్లబ్, వనిత క్లబ్ ప్రతినిధులు సందర్శించి ప్రధానోపాధ్యాయురాలు ఇంది ర,అధ్యాపకురాలు సునీతలను మహిళా దినోత్సవం సం దర్భంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థు లకు 70ప్లేట్లను అందజేశారు. కార్యక్రమంలో వాసవి, వనిత క్లబ్ల ప్రతినిధులు పద్మ, సరిత, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
దళిత సేన, ఓబీసీ సంఘాల ఆధ్వర్యంలో బల్దియా పారిశుధ్య మహిళా కార్మికులను ఎర్రగడ్డలో సన్మానించి బహుమతులను అందజేశారు. సన్మానం అందుకున్న వా ళ్లలో అమృత, నర్సమ్మ, మంగమ్మ, బి.దుర్గమ్మ, ఎస్.రా జ్యలక్ష్మి ఉన్నారు. దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్, సంఘాల ప్రతినిధులు బాలయ్య పాల్గొన్నారు.
వెంగళరావునగర్, ఫిబ్రవరి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్స్టేషన్లో మహిళా సిబ్బందితో కలిసి ఎస్సార్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కేక్ కట్ చేశారు. అనంతరం మహిళా సిబ్బందికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్సైఅశోక్నాయక్, అంజనేయులు, ఏఎస్సై కె.నిర్మలాదేవి,దివ్య,నవ్నీత, మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.
జూబ్లీహిల్స్,మార్చి8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెట్విన్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో నిర్వహించిన ప్రతిభా పోటీల్లో యూసుఫ్గూడ సెట్విన్ కేంద్రానికి ద్వితీయ స్థానం దక్కింది. సోమవారం నగరంలో జరిగిన వేడుకల్లో గార్మెంట్ మేకింగ్ విభాగం లో బి.సత్యమంగళ ద్వితీయ బహుమతి అందుకున్నారు. అదేవిధంగా యూసుఫ్గూడ నిమ్స్మేలో డైలీ వేజెస్ సిబ్బందికి ఆంధ్ర లయోలా కాలేజీ అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల పూర్వ విద్యార్థి డేవిడ్ బ్రైనార్డ్ బహుమతులు పంపిణీ చేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ యూసుఫ్గూడ సర్కిల్ 19 ఆధ్వర్యంలో సర్కిల్లోని పారిశుధ్య విభాగం మహిళలతో ఏఎంఓహెచ్ బిందు భార్గవి కేక్ కట్చేశారు.
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ ): అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని రెడ్హిల్స్లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో నిర్వహించారు. ఈ కార్య క్రమానికి అనురాధా రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జీఎం కో ఆర్డినేషన్ కె. రవిశంకర్, మార్కెటింగ్ జీఎం సూర్యనారాయణ, సీఎంఓఏఐ ప్రధా న కార్యదర్శి ఎస్వీ రాజశేఖర్రావు, డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్, ప్రజాకవి జయరాజ్, డిప్యూటీ లా మేనేజర్ శిరీ షారెడ్డి, షర్మిలా మోజెస్, ధనలక్ష్మి, కవిత, శ్రీలక్ష్మీ, జ్యోతి పాల్గొన్నారు.