సిరికొండ : మహిళా సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. శనివారం మండలంలోని రాంపూర్ గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం దళితులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తుందని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
రాంపూర్, సిరికొండ వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రేణుక బాయి, ఉప సర్పంచ్ ప్రహ్లాద్, టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు బాలాజీ, సునీల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు చేండె బాలాజీ, రాజ్ కుమార్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.