నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 16 : జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులను విస్తృతంగా నిర్వహించడంతో పాటు కొవిడ్ టీకాలను వేస్తున్నారు. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
పిట్లం మండలంలోని రాంపూర్ ఆరోగ్య ఉపకేంద్రంలో, మండలకేంద్రంలోని ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారులు శుక్రవారం కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. రాంపూర్ ఆరోగ్యకేంద్రంలో సహకారసంఘం చైర్మన్ శపథంరెడ్డి టీకా వేయించుకున్నారు. మండలకేంద్రంలోని ఆరోగ్యకేంద్రంలో 78 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 37 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి శివకుమార్ తెలిపారు.
లింగంపేట మండలకేంద్రంలోని పీహెచ్సీలో 120 మందికి పరీక్షలు నిర్వహించగా.. 28 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యురాలు సమీనా తెలిపారు. ఒకే కుటుంబంలో 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. మండల కేంద్రంతో పాటు పర్మళ్లలో అత్యధికంగా 20 కేసులు నమోదైనట్లు తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో 156 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించారు.
బీర్కూర్ మండలకేంద్రంలోని పీహెచ్సీలో 234 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 82 మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో 45 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేశారు.
గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 140 మందికి, ఉత్తునూరులో 140 మందికి టీకాలను వేసినట్లు వైద్యుడు హరికృష్ణ తెలిపారు. గాంధారి దవాఖానలో 82 మందికి పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి, ఉత్తునూరు పీహెచ్సీలో 110 మందికి పరీక్షలు నిర్వహించగా.. 17 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వంద మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 17 మందికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ నందిత తెలిపారు. 146 మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపారు.
తాడ్వాయి మండలపరిధిలోని ఎర్రాపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 206 మందికి కరోనా టెస్టులు చేయగా.. 23 మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 162 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు.
నిజాంసాగర్ ఆరోగ్యకేంద్రంలో 56 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. నిజాంసాగర్లో 8, అచ్చంపేటలో 3, మాగి ఫ్యాక్టరీలో 2, మాగిలో 1, మల్లూర్తండాలో 1, సింగీతంలో 1, తెల్గాపూర్లో 3 కేసులు నమోదైనట్లు వివరించారు. నిజాంసాగర్లో 105 మందికి, మహ్మద్నగర్లో 147 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు.
రామారెడ్డి మండలం అన్నారం ప్రభుత్వ దవాఖానలో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ ద్వారా 53 మందికి పరీక్షలు చేయగా.. 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రాము తెలిపారు. రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో 200 మందికి టీకా వేసినట్లు డాక్టర్ షాహిద్ అలీ తెలిపారు. వంద మందికి కరోనా టెస్టులు చేయగా.. 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.దోమకొండ ప్రభుత్వ దవాఖానలో 72 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని దవాఖాన సూపరింటెండెంట్ సంగీత్కుమార్ తెలిపారు. 140 మందికి కరోనా వ్యాక్సిన్ వేశామని చెప్పారు. భిక్కనూరు మండలంలో 113 మందికి పరీక్షలు నిర్వహించగా.. 25 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాచాపూర్లో నలుగురు, బస్వాపూర్లో ముగ్గురు, పెద్ద మల్లారెడ్డిలో ఇద్దరు, భిక్కనూరులో ఐదుగురు, రామేశ్వర్పల్లిలో నలుగురు, అంతంపల్లి, కామారెడ్డిలో ఇద్దరు, జంగంపల్లి, రైల్వేస్టేషన్, రైల్వేస్టేషన్లోని రెసిడెన్షియల్ కాలేజీలో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారని చెప్పారు.
రాజంపేట పీహెచ్సీలో 114 మందికి పరీక్షలు నిర్వహించగా.. 24 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి శిరీష్ తెలిపారు. బీబీపేట్ పీహెచ్సీలో శుక్రవారం 62 మందికి టెస్టులు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని హెచ్ఈవో శంకర్ తెలిపారు. యాడారం, అంచనూర్ గ్రామాల్లో ఒక్కొక్కరి చొప్పున, బీబీపేట్లో ఏడుగురికి కొవిడ్-19 నిర్ధారణ అయ్యిందని చెప్పారు.
వ్యాక్సిన్పై అవగాహన..
నాగిరెడ్డిపేట్ మండలం బంజారా తండాలో సర్పంచ్ అరుణ ఇంటింటికీ తిరిగి టీకాపై అవగాహన కల్పించారు. 45 ఏండ్లు దాటిన వారందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు. మాస్కు ధరించని 10 మందికి రూ. 100 చొప్పున జరిమానా విధించినట్లు సర్పంచ్ తెలిపారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి మమత ఉన్నారు.
ఇవీ కూడా చదవండీ…
అలుగు పారిన హల్దీవాగు ప్రాజెక్టు