మెహిదీపట్నం /సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ ): ఆషాఢ బోనాల ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్న గోల్కొం డ బోనాల నిర్వహణ ఏర్పాట్లపై ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి గోల్కొండ కోటలో మంత్రి తలసాని సోమవారం సమీ క్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందు గా మంత్రికి స్థానిక అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.10లక్షలు మంజూరు చేస్తున్న ట్లు మంత్రి ప్రకటించారు.
11వ తేదీన లంగర్హౌజ్ నుంచి గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయం వరకు తొట్టెల ఊరేగింపు ఉం టుందన్నారు. తొట్టెల ఊరేగింపులో కళాకారుల వేషధారణలతో ప్రదర్శనలు నిర్వహిస్తారని తెలిపారు. అదే రోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనార్థం భక్తుల కోసం బారికేడ్లు, ప్రత్యేక హెల్త్ క్యాం పులు,టాయిలెట్స్ ఏర్పా టు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా రెండు 500కేవీ ట్రాన్స్ఫార్మర్లు, ఒక మొబైల్ ట్రాన్స్ఫార్మర్ను అందుబాటులో ఉంచుతామన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యం లో ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో టూరిజం శాఖ ఎండీ మనోహర్ రావు, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, ఆలయ ఈవో మహేందర్కుమార్, వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ఏసీపీ కోటేశ్వర్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, కార్పొరేటర్ స్వామి యాదవ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.