అమరావతి : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ కాసేపటి క్రితం విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ మూడు రోజులు రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్చేసుకోవాలని టీటీడీ సూచించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.