న్యూఢిల్లీ : కరోనా తీవ్రత దృష్ట్యా మరో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం ప్రకటించింది. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఏప్రిల్ సెషన్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్ 27, 28, 30 తేదీల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలను కూడా వాయిదా వేశారు.