హైదరాబాద్ : పాతబస్తీలోని మంగళ్హాట్ పరిధిలో బాలికపై నిన్న రాత్రి అత్యాచారం జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు సుమిత్ అనే యువకుడు తొమ్మిదేండ్ల బాలికను నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులతో స్థానికులు అక్కడికి వెళ్లి.. సుమిత్ను పట్టుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. హబీబ్నగర్ పరిధిలో నమోదైన ఓ చోరీ కేసులో సుమిత్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో ఏసీపీ నరేందర్ రెడ్డి విచారణ చేపట్టారు. బాలికను భరోసా సెంటర్కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.