న్యూజిలాండ్లో పీవీ జయంత్యుత్సవాల్లో
ఎమ్మెల్సీ వాణీదేవి, ఎన్నారై సెల్ కన్వీనర్ మహేశ్బిగాల
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ప్రత్యేకమైన అభిమానం అని, అందుకే ప్రత్యేక చొరవ తీసుకొని పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె సురభివాణీదేవి అన్నారు. న్యూజిలాండ్లోని మోటార్కేడ్లో పీవీ శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి వాణీదేవి వెబినార్ ద్వారా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పీవీ రాజకీయనేతగా ప్రధాని పదవికే పరిమితం కాకుండా నిరంతరం కొత్త విషయాన్ని నేర్చుకొనేవారన్నా రు. విషయ పరిజ్ఞానం ఎంత ఉన్నా ఎదుటి వ్యక్తి చెప్పేది వినటం, అవతలి వ్యక్తి దృక్పథం తెలుసుకోవటం, నేర్చుకోవటం పీవీకి ఉన్న గొప్ప గుణాలని చెప్పారు. కార్యక్రమ సమన్వయక్త, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కన్వీనర్, శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల పీవీ శతజయం తి ఉత్సవాలను చేపట్టిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా, కెనడా, జర్మనీ, కువైట్, డెన్మార్క్ సహా 50కిపైగా దేశాల్లో పీవీ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పీవీకి భారతరత్న ఇచ్చేలా ప్రభుత్వంతోపాటు పౌరసమాజం గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని ఉత్సవాల్లో పాల్గొన్న న్యూజిలాండ్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో న్యూజిలాండ్ తెలుగు సంఘాల ప్రతినిధులు ఒడ్నాల జగన్మోహన్రెడ్డి, కృష్ణారెడ్డి, అరుణ్ప్రకాశ్రెడ్డి, రామారావు, విజయ్ కోస్నా, కే కల్యాణ్, నరేందర్రెడ్డి, ప్రసన్న, ధర్మేందర్, నీరవ్సింగ్ పాల్గొన్నారు.