కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 4 : హరితహారం లక్ష్యాన్ని చేరుకునే దిశగా మల్టీలేయర్ ప్లాంటేషన్పై దృష్టి పెట్టినట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుంచి సూరారం వరకు చేపట్టిన మల్టీలేయర్ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో విరివిగా మొక్కలు నాటుతూ కాపాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ యేడాది హరితహారంలో మల్టీలేయర్ ప్లాంటేషన్పై దృష్టి సారించామన్నారు. రంగధాముని చెరువుకట్ట రోడ్డు, నర్సాపూర్ చౌరస్తా నుంచి సూరారం వరకు రోడ్డు ఫుట్పాత్ పక్కన బహుళ వరుసలలో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూసీజీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి, డీసీ రవికుమార్, ఏఎంహెచ్వో చంద్రశేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఫతేనగర్లో ఎస్టీపీ ఏర్పాటుకు పరిశీలన
కేపీహెచ్బీ కాలనీ : ఫతేనగర్ నాలాపై సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, ఎస్ఈ శంకర్ నాయక్, జలమండలి డైరెక్టర్, సీజీఎంలు సంయుక్తంగా పరిశీలించారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని వారు తెలిపారు.