హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( GHMC ) మేయర్ గద్వాల విజయలక్ష్మి మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ పట్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయలక్ష్మి హెచ్చరించారు.