సిటీబ్యూరో, సెప్టెంబరు 21(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదిలి, పెట్ షాపులను నిర్వహిస్తున్న యాజమాన్యాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. జీహెచ్ఎంసీ అనుమతి లే కుండా, విధి విధానాలకు విరుద్ధంగా షాపుల నిర్వహణను జీహెచ్ఎంసీ తప్పుబట్టి 142 దుకాణాలకు నోటీసు లు జారీ చేసింది. గ్రేటర్లో జంతు ప్రేమికుల డిమాండ్ను క్యాష్ చేసుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘పెట్’ షాపు ల నిర్వాహకులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. అనుమతి లేని షాపులకు నాలుగు వారాల పాటు సమయం ఇచ్చి నా, నిబంధనలు అతిక్రమించిన 142 షాపులను గుర్తించి నోటీసులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో పెంపుడు జంతువుల దుకాణాలపై క్షేత్రస్థాయిలో సర్వే జరపాలని పురపాలక ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కు మార్కు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ పొందిన వారు మాత్రమే పెంపుడు జంతువుల షాపులు నడిపేందుకు, వ్యాపారం చేసేందుకు, పెంపు డు జంతువులు అమ్మకాలను రిటైల్, హోల్సేల్గా జరిపేందుకు వీలుంది. నిబంధనల ప్రకారం, స్టేట్ యానిమల్ వెల్ఫే ర్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది, ఆ తర్వాత స్థాని క సంస్థ నుంచి లైసెన్స్ పొందిన వారు మాత్రమే పెట్ షాపు నిర్వహించాల్సి ఉంటుంది.
రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిపికెట్లు పొందుటకు పెంపుడు జంతువు ల షాపులను నిర్వహించే యాజమాన్యాలకు నాలుగు వారా ల పాటు సమయం ఇచ్చారు. చట్టం ప్రకారం, ప్రతి పెట్ షా పు రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, జీహెచ్ఎంసీ నుంచి వాలీడ్ ట్రేడ్ లైసెన్స్ను కలిగి లేకపోవడంతో సంబంధిత పెట్ షాపులకు నోటీసులిచ్చారు. నగరం లో క్షేత్రస్థాయిలో మొత్తం 597 పెట్షాపులుండగా, ఇందు లో కేవలం 420 షాపులు మాత్రమే అనుమతి పొందినట్లు అధికారులు పేర్కొన్నారు. 35 షాపుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని వివరించారు.
జంతు సంక్షేమ చట్టాలు, నిబంధనలు, సూచనల అమ లు, పెంపుడు జంతువులు ఆరోగ్యం, రక్షణ చర్యలతో పాటు జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టుటకు రూపొందించిన లక్ష్యాల అమలులో భాగంగా జంతు సంక్షేమ బోర్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందుటకు తప్పనిసరి చేశారు. చట్టం ప్రకా రం, ప్రతి పెట్ షాపు రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, జీహెచ్ఎంసీ నుంచి వాలీడ్ ట్రేడ్ లైసెన్స్ను కలిగి ఉండాలి. కేంద్ర పర్యావరణ ఆటవీ వాతావరణ మా ర్పుల మంత్రిత్వ శాఖ రూపొందించిన పెంపుడు జంతువుల పై క్రూరత్వ నిషేధిత చట్టం-2018 ప్రకారం, రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో సంబంధిత షాపు ఏర్పాటు, అమలులో నియమ నిబంధనలు పరిశీలించాకే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. అనంతరం, దీనిపై జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ జారీ చేస్తుంది. అప్పుడే, అన్ని రకాల పెంపుడు జంతువుల షాపు నిర్వహణ చేయాల్సి ఉంటుంది.