హైదరాబాద్: రాజధానిలో జోరుగా వానలు కురుస్తున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమయ్యింది. మేయర్తోపాటు, ప్రజాప్రతినిథులు, అధికారులు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. మరోమారు వరదలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మైలార్దేవ్పల్లిలోని పల్లెచెరువును జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి చెరువును పరిశీలించారు. చెరువులో గుర్రపుడెక్క తొలగించాలని మేయర్ సూచించారు. గతేడాది వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు పల్లెచెరువు తెగిపోయిన విషయం తెలిసిందే. వర్షాల వల్ల మరోమారు చెరువుకు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.