బన్సీలాల్పేట్, మే 12 : జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, టీటీయూసీ అధ్యక్షుడు మోతే శోభన్రెడ్డిలు బుధవారం గాంధీ దవాఖానను సందర్శించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుతో సమావేశమై కరోనా బాధితులకు అందజేస్తున్న వైద్య సేవలు, ఆక్సిజన్, వెంటిలేటర్, బెడ్లు, వార్డుల్లో రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
గాంధీ వైద్యులు, నర్సులు, సిబ్బంది నిరంతరం అందజేస్తున్న వైద్య సేవలను డిప్యూటీ మేయర్ అభినందించారు. నగర పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ, గాంధీ దవాఖానల సమన్వయంతో తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాలను నుంచి చికిత్స కోసం వచ్చే వారికి అవసరమైన వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి గాంధీ దవాఖాన ఎదురుగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రోగుల సహాయకుల కోసం ఉచిత వసతి, భోజన సేవలను ప్రారంభించామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావులు గాంధీ దవాఖానకు అన్ని విధాలుగా చేయూతనందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశంలోనే అత్యధిక కరోనా రోగులకు సేవలందిస్తున్న దవాఖానగా గాంధీ ఖ్యాతిగాంచిందని తెలిపారు.