హైదరాబాద్ : నగరంలోని శాస్త్రిపురం వార్డులో శిధిలావస్థలో ఉన్న భవనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఒవైసీ హిల్స్లోని జి +1 భవనం బాగా దిబ్బతింది. ఏ క్షణమైన కూలి ప్రజలకు ప్రమాదంగా మారింది. ఈ విషయాన్ని ఆ ఇంటి కుటుంబ సభ్యులు సైతం అర్థం చేసుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ భవనాన్ని కూల్చివేసినట్లు స్థానిక కార్పొరేటర్ మొహమ్మద్ ముబిన్ తెలిపారు. భవనం కొండపై ఉండటంతో అది కూలినప్పుడు పక్కనే ఉన్న ఇతర భవనాలకు కూడా ముప్పు పొంచిఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వేరే ప్రాంతంలో మరో రెండు బిల్డింగ్లు కూడా ఇదే స్థితిలో ఉన్నట్లు వాటిని కూడా కూల్చివేయనున్నట్లు పేర్కొన్నారు.