గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొవిడ్-19 వ్యాపిస్తుండటంతో జీహెచ్ఎంసీ నివారణ చర్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొవిడ్ నివారణకు అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులు, జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేకంగా సర్క్యూలర్ జారీ చేశారు.