సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2021-22 వార్షిక బడ్జెట్ రూ.6,841.87కోట్లుగా నిర్ధారించగా.. మంగళవారం వర్చువల్గా జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బడ్జెట్ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రవేశపెట్టగా, బడ్జెట్లోని వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ సమావేశంలో వివరించారు. ఈ బడ్జెట్పై విస్తృతంగా జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు లోకేశ్కుమార్, ఫైనాన్స్ విభాగం అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనేడి సమాధానాలు ఇచ్చారు. ఈ చర్చలో సభ్యులు పలు సూచనలు చేశారు. అనంతరం బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
బడ్జెట్ వివరాలు