సికింద్రాబాద్, అక్టోబర్ 14 : నిబంధనలు ఎవరికైనా ఒకటేనని జీహెచ్ఎంసీ నిరూపించింది. బహిరంగ ప్రదేశంలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమకు రూ.5వేల జరిమానా విధించింది. బుధవారం సీతాఫల్మండి డివిజన్ మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.