మాదాపూర్, సెప్టెంబర్ 13: సినీ నటుడు సాయి ధరమ్తేజ్ నాలుగు రోజుల కిందట ద్విచక్ర వాహనంపై నుంచి పడి ప్రమాదానికి గురైన ఘటన నేపథ్యంలో వాహనదారుల భద్రతపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. ప్రధాన రహదారుల్లో రోడ్డుకు ఇరువైపులా జరుగుతున్న నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రహదారులపై ఇసుక చేరుతున్న కారణాలను పరిగణలోకి తీసుకొని జరిమానాలను విధిస్తున్నారు. ఇందులో భాగంగా మాదాపూర్లో సైబర్ టవర్స్ నుంచి హైటెక్ సిటీ రైల్వేస్టేషన్కు వెళ్లే దారిలో అరబిందో సంస్థకు చెందిన యాజమాన్యం అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నది. సోమవారం అక్కడకు చేరుకున్న జీహెచ్ఎంసీ ఎఎంహెచ్ఓ (అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్), ఎస్ఆర్పీ శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది రహదారిపై ఉన్న ఇసుకను గమనించారు. నిర్లక్ష్యంగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ప్రధాన రహదారిపై ఇసుక చేరినట్లు గుర్తించారు. దీంతో అరబిందో సంస్థకు రూ. 1 లక్ష జరిమానా విధించారు.