ఎల్బీనగర్, జూలై 31: హైదరాబాద్ మహా వ్యాప్తంగా దోమల నివారణకు పెద్ద ఎత్తున యు ద్ధం చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ ఏ.రాంబాబు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్ల పరిధిలో భద్రత, దోమల నివారణకు చర్యలను చేపడుతున్నట్టు రాంబాబు తెలిపారు. ఎల్బీనగర్ జోన్లోని చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీ వద్ద మూసీనదిలో డ్రోన్ల ద్వారా శనివా రం దోమల నివారణ మందులను చల్లించడంతో పాటు అయిల్ బాల్స్ను మురికి నీటిలో వదిలా రు. అనంతరం, ఎంటమాలజీ శాఖ పనితీరుపై ఎల్బీనగర్ జోనల్ కార్యాలయం వద్ద సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో, మూసీనది బాపూఘాట్ నుంచి నాగోలు వరకు 21 కిలో మీటర్ల పొడవునా 11 బ్రిడ్జ్లు ఉన్నాయని, వీటి పరిధిలో దోమల లా ర్వాలు వృద్ధి చెందకుండా పూర్తిగా తొలగిస్తున్నామన్నారు. ఎల్బీనగర్ జోన్లోని 39 లేక్స్ను పూర్తిగా ప్రత్యేక శ్రద్ధతో దోమలకు ఆవాసాలు లేకుండా చేశామన్నారు. ఆరు జోన్లలో 11 డ్రోన్స్ లను ఏర్పాటు చేసి దోమల నివారణ మందులను మూసీ, చెరువుల్లో పిచికారి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ రజిని, సూపర్వైజర్లు ప్రసాద్, రుక్కయ్య పాల్గొన్నారు.