సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ): మహా నగరంలో మహిళా రక్షణకు మరో వేదిక ఏర్పడింది. మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ సన్నద్దమైంది. వారి రక్షణ కోసం జీహెచ్ఎంసీ అన్ని కార్యాలయాల్లో షీ బాక్స్లను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా htpp//tshebox.tgwdcw.in అనే వెబ్సైట్లో మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పి.ప్రావీణ్య, ఇంటర్ననల్ మెంబర్లుగా అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ప్రియాంక అల, పి.సరోజ, వి.మమత, ఎస్.పంకజ, కె.అలివేలు మంగతాయారు, బి.సంధ్య, డి.సరోజ, కె.శారద, మృదులను నియమించారు.