సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రోడ్ కటింగ్ అనుమతులకు బ్రేక్లు పడ్డాయి. వర్షాకాలం దరిమిలా అక్టోబర్ 31 వరకు కొత్తగా రోడ్డు తవ్వకాలను నిలిపివేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకున్నది. కాగా.. వివిధ ప్రైవేట్ సంస్థలు భూగర్భ కేబుల్స్ తదితర పనులతో పాటు విద్యుత్, వాటర్బోర్డు , బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు సైతం అవసరమైన కేబుల్స్, పైపులైన్ల ఏర్పాటు వంటి పనుల కోసం రోడ్ల తవ్వకాలు జరుపుతుంటాయి. గత జనవరి నుంచి మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు దాదాపు 54 కి.మీల మేర రోడ్ల తవ్వకాలకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొందాయి. ఇందులో భాగంగానే లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పలు సంస్థలు పనులను పూర్తి చేసుకున్నాయి. ఇక కొత్తగా ఆయా పనుల నిమిత్తం రోడ్ల కటింగ్స్కు అనుమతి ఇచ్చేది లేదని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఏడాది రోడ్ కటింగ్ అనుమతులు …
వీటితో పాటు ఎల్పీజీ సంస్థలు, హెచ్ఆర్డీసీ (హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా మరికొన్ని కి.మీ మేర అనుమతులు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.