గ్రేటర్ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.. వైరస్ను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి యుద్ధప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రవాణాన్ని పిచికారి చేస్తున్నది. పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలు, వాటి పరిసరాలు, ఆసుపత్రులు, ఇన్స్టిట్యూట్స్, పర్యాటక ప్రాంతాలు, వివిధ ప్ర భుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, రేషన్ దుకాణాలు, ఏటీఎం కేంద్రాలు.. ఇలా జన సంచారం కలిగిన ప్రాం తాలు, కాలనీలు, బస్తీల్లో రసాయనాలను స్ప్రే చేస్తున్నా రు. గ్రేటర్లోని 30 సర్కిళ్లల్లో స్ప్రే కార్యక్రమాలను ము మ్మరం చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న 18 వాహనాలకు తోడు 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మరో 30 వాటర్ ట్యాంకర్లను అద్దెకు తీసుకుంటున్నారు. వీటిని జోన్కు ఐదు చొప్పున వినియోగించనున్నారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం, ఈవీడీఎం సంయుక్తంగా ఈ స్ప్రే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. పగలు, రాత్రి కూడా పిచికారి కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గడిచిన 20 రోజులుగా 2,551 ప్రాంతా లు, 1,54,700 ఇండ్లలో స్ప్రే చేశామని ఎంటమాలజీ చీఫ్ రాంబాబు తెలిపారు. కరోనా కట్టడే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు 13,700ల లీటర్ల రసాయనాన్ని పిచికారీ చేశామని ఆయన చెప్పారు.