జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఈ నెల 22న జరగనున్నది. ఫిబ్రవరి రెండో వారంలో నూతన పాలకవర్గం కొలువుదీరిన విషయం తెలిసిందే. కాగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అందుబాటులోకి రావడం, వెనువెంటనే లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో నూతన పాలకవర్గం మొదటి కౌన్సిల్ మీ టింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం లింగోజిగూడ డివిజన్ ఎన్నిక ప్రక్రియ ముగియడంతో కోడ్ అడ్డంకి ముగిసినైట్టెయింది. దీంతో ఈ నెల 22న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.