కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 27 : వందశాతం స్వచ్ఛతను సాధించే దిశగా ఇంటింటి సర్వేను చేపట్టనున్నట్లు కూకట్పల్లి సర్కిల్ ఉప కమిషనర్ కె.ప్రశాంతి అన్నారు. మంగళవారం సర్కిల్ పారిశుధ్య విభాగం సిబ్బందితో ఆన్లైన్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీలలోని ప్రతి ఇల్లు, కమర్షియల్ గృహాల వివరాలను సేకరించాలని సిబ్బందికి సూచించారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఖాళీ ప్రదేశాలు, తరచుగా చెత్తవేసే ప్రాంతాలలో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని వ్యర్థాలను స్వచ్ఛ ఆటోలలోనే వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై చెత్తను ఊడ్చినప్పుడు ఖాళీ ప్రదేశంలో వేయకుండా బ్యాగులలో నింపాలని సూచించారు. చెత్తను తరలించే వాహనాలకు రూట్ మ్యాప్ను సిద్ధం చేసి ప్రతి వాహనం రోజూ రెండుమూడు సార్లు చెత్తను తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ పరిసరాల కోసం బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్వో చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఎస్ లింగారెడ్డి, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 27 : మెరుగైన పారిశుధ్య నిర్వహణే లక్ష్యంగా చేపడుతున్న ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. మంగళవారం సర్కిల్ పారిశుధ్య విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసాపేట సర్కిల్లో సంపూర్ణ స్వచ్ఛతను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. కాలనీలు, బస్తీలలోని ప్రతి ఇల్లు, వాణిజ్యసముదాయం, ఇతర వివరాలను సేకరించాలన్నారు. ప్రత్యేక యాప్లో సమాచారాన్ని పొందుబర్చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ మురళీధర్రెడ్డి, ఎస్ఆర్పీ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు.