గౌతంనగర్,ఏప్రిల్25 : వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురికాకుండా గౌతంనగర్ డివిజన్లో జీహెచ్ఎంసీ సిబ్బంది నాలా పూడికతీత పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కరోనాతో పాటు ఇతర వ్యాధులు సోకకుండా మరోవైపు శానిటేషన్ పనులను ప్రారంభించారు. ఎత్తయిన ప్రాంతాలు హిల్టాప్ బస్తీ, ఇందిరానెహ్రూనగర్ బస్తీ, రామాంజనేయనగర్ నుంచి వచ్చే వరదలకు జ్యోతినగర్ నాలా దిగువన ఉన్న కాలనీలు మురుగు, వరదనీటిలో మునిగిపోతాయి. వరద ముంపు నివారణ కోసం నాలా పూడికతీత పనుల కోసం రూ.25లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో జ్యోతినగర్, రాజానగర్, వెంకటాద్రినగర్లో ఉన్న నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఏరియాలో పరిశుభ్రతపై జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్ ప్రత్యేక దృష్టి సారించారు.
కరోనా సెకండ్ వెవ్లో బస్తీలు, కాలనీల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటైజేషన్ చేస్తున్నారు. ఇందిరానెహ్రూనగర్, హిల్టాప్ బస్తీ, బీహారీ బస్తీ, రామాంజనేయనగర్, మల్లికార్జుననగర్, జ్యోతినగర్, గౌతంనగర్ తదితర ఏరియాల్లో స్వీపింగ్ చేసి ఎప్పటికప్పుడు శానిటైజేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బస్తీలు, కాలనీల్లో పరిశుధ్య పనులు చేయించి ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయిస్తున్నాను. ప్రతి రోజు ఉదయం డివిజన్లో పర్యటించి మాస్కు ధరించాలని, రోడ్లపై చెత్త వేయవద్దని ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నాను. వర్షాకాలంలో వరదముంపునకు గురికాకుండా ముందస్తుగా నాలాల్లో పూడికతీత పనులను చేపట్టాం. దీంతో జ్యోతినగర్, రాజానగర్, వెంకటాద్రినగర్, మిర్జాల్గూడ వరకు సాఫీగా వరదనీరు పారుతుంది. – మేకల సునీతారాముయాదవ్, కార్పొరేటర్