బండ్లగూడ : స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ జరిగింది. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు ఉడాయించారు. ఓ అప్లికేషన్ లో విద్యార్థుల పూర్తి వివరాలు తీసుకున్న నిర్వాహకులు సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 నుంచి 4 వేల రూపాయలు వసూలు చేశారు. కొంత కాలం తర్వాత విద్యార్థులు తమ స్కాలర్షిప్ల గురించి ఆరా తీయగా కొవిడ్ కారణంగా ఆలస్యం జరుగుతుందని చెప్పి దాట వేస్తూ వస్తున్నారు .
కాగా శుక్రవారం కొంతమంది విద్యార్ధులు గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ కార్యాలయం వద్దకు వెళ్లగా అక్కడ కార్యాలయం మూసి ఉంది. దీంతో విద్యార్ధులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ కార్యాలయంపై దాడులు జరిపిన పోలీసులు…. 1500 అప్లికేషన్ లను స్వాధీనం చేసుకున్నారు. కాగా సంస్థకు చెందిన మాజీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సిఐ కనకయ్య తెలిపారు.