సికింద్రాబాద్ : నామాలగుండులోని శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మూలవిరాట్ వెంకటేశ్వరస్వామివారికి వేద పండితులు ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, సుప్రభాతసేవా, విష్ణుసహస్రనామ, సామూహిక కుంకుమార్చన తదితర పూజలను జరిపారు.
ఆలయ సింగిల్ ట్రస్టీ నోముల ప్రకాశరావు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం వెంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపనున్నట్లు ఆలయ సింగిల్ ట్రస్టీ నోముల ప్రకాశరావు తెలిపారు. భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.