భువనగిరి టౌన్, ఏప్రిల్ 19 : 45 ఏండ్లకు పైబడిన వారందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 33వ, 34వ వార్డులకు సంబంధించి స్థానిక ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన కొవిడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొవిడ్ వ్యా క్సిన్ సురక్షితమని, అపోహలు వీడి అందరూ తీసుకోవాల న్నారు. ఈ సందర్భంగా 33వ, 34వ వార్డుల కౌన్సిలర్లు క్రాంతి, దుర్గాభవాని టీకా వేయించుకున్నారు. కార్యక్ర మంలో మున్సిపల్ వైస్చైర్మన్ కిష్టయ్య, రాజేశ్, గంగాధర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లీలావతి, హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ రాజీవ్, ఏఎన్ఎంలు శోభ, ఉమ, ఆశవర్కర్లు నర్సమ్మ, హేమలత, బాలమణి, రమణ, సబిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ టీకా పంపిణీ
మండలంలోని పెద్దకందుకూరు, మైలార్గూడెం, కాచారం గ్రామాల్లో 45 ఏం డ్లు పైబడిన వారికి ఆరోగ్య సిబ్బంది కొవిడ్ టీకాలు వేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీశైలం, సర్పంచ్ రాములుగౌడ్ హాజరయ్యారు.
10వ వార్డులో ..
స్థానిక 10వ వార్డులో 45 ఏండ్లు నిండిన వారికి మండల వైద్యాధికారి శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సోమవారం టీకాలు వేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, కౌన్సిలర్ బాలకృష్ణగౌడ్, నర్సింహ్మ, బాలరాజు, శివ, యాదగిరి పాల్గొన్నారు.
ఎల్లంబావిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాను వేయించుకోవాలని ఎంపీపీ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం ఎల్లంబావి గ్రామంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, సర్పంచ్లు కొండల్, ఇందిరాసత్తిరెడ్డి, ఎంపీటీసీ ఈశ్వర మ్మ, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ కొత్త పర్వతాలుయాదవ్, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
వలిగొండలో 25 మందికి కొవిడ్..
మండలవ్యాప్తంగా 91మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 25మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ కిరణ్కుమార్ సోమవా రం తెలిపారు. మండలంలోని కంచనపల్లి, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, వలిగొండ, వేములకొండ, చిత్తాపురం, నర్సయ్యగూడెం, నర్సాపురం, అరూరు, వర్కట్పల్లి, మాందాపురం, నాతాళ్లగూడెం, ప్రొద్దటూర్ తదితర గ్రామాల్లో మొబైల్ బృందాల ఆధ్వర్యంలో 45 ఏండ్లు నిండిన వారికి కొవిడ్ టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ట్రైనింగ్ టీం డాక్టర్ ప్రశాంత్ వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో వైద్యులు సంతోష్రెడ్డి, జ్యోతి, స్వామి, వైద్య సిబ్బంది నర్సింహ్మ, సత్యవతి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రోడ్లపై ఫైర్ ఇంజిన్ సహకారంతో మున్సిపల్ అధికారులు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించా రు. సోమవారం పట్టణంలోని బస్టాండ్ నుంచి పోతాయిగడ్డ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రధాన రోడ్లు, కొవిడ్ పా జిటివ్ వచ్చిన వారి ఇండ్ల పరిసరాల్లో హైపోక్లోరైడ్ను పిచికారీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్, వైస్ చైర్మన్ వెంకటయ్య, ఎస్ఐ ఉదయ్కిరణ్, ఫైర్ ఆఫీసర్ సాయిదీపక్, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మండల పరిధిలోని కొండమడుగు పీహెచ్సీలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పింగల్రెడ్డి సోమ వారం కొవిడ్ టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధి కారులు ప్రవీణ్కుమార్, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
1,029 మందికి కొవిడ్ టీకా
బొల్లెపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో మండలంలోని బీఎన్.తిమ్మాపూర్, హన్మాపురం, పగిడిపల్లి, పీబి.తండా, పెంచికల్పహాడ్, బాలంపల్లి గ్రా మాల్లో సోమవారం 1,029 మందికి కొవిడ్ టీకా వేసినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు.
నారాయణపురంలో 737మందికి..
మండల వ్యాప్తం గా సోమవారం 737 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి దీప్తి తెలిపారు. పీహెచ్సీలో 52 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు.
ఆత్మకూరు(ఎం)లో 722 మందికి..
మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రంతోపాటు రహీంఖాన్పేట, పో తిరెడ్డిపల్లి, రేగులకుంట, పుల్లాయిగూడెం, మోదుగుకుంట గ్రామాల్లో 722 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి ప్రణీష తెలిపారు. అదేవిధంగా మండలంలో 35 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్గా తేలిందన్నారు.
అడ్డగూడూరులో 520 మందికి..
మండలంలోని డి.రేపాక, చిన్నపడిశాల గ్రామాల్లో నిర్వహించిన మొబైల్ క్యాంపుల్లో
520 మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు మండల వైద్యా ధికారి నరేశ్ తెలిపారు. అదేవిధంగా 20మందికి కొవిడ్ పరీ క్షలు చేయగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
తుర్కపల్లిలో 467మందికి..
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు కొనాపురం, ఇబ్రహీంపురం, సం గ్యాతండా, రాంపూర్ గ్రామాల్లో సోమవారం 467మంది కి కొవిడ్ టీకా వేసినట్లు వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. అదే విధంగా స్థానిక పీహెచ్సీలో 55 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 15మందికి పాజిటివ్గా తేలిందన్నారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి
మండల కేంద్రంలో సోమవారం కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాచకొండ కమి షనరేట్ పోలీస్ కళాబృందంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట రూరల్ సీఐ నర్సయ్య మాట్లాడుతూ కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభి స్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్ర మంలో ఎస్ఐ శ్రీధర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
అంబట్పల్లిలో స్వచ్ఛందంగా లాక్డౌన్
అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి
ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుంది