హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్తుపదార్థాల వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు విక్రయించే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ నేతృత్వంలోని పోలీసుల బృందం ఒక గంజాయి వ్యాపారిని పట్టుకుంది.
నానక్రాం గూడకు చెందిన ధను సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు ధను సింగ్ వద్ద నుంచి 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.