ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
టీకాపై అపోహలు పోగొట్టాలి
డీఎంహెచ్వో చందూనాయక్
గట్టు, ఏప్రిల్ 22: కొవిడ్ వాక్సినేషన్ వేగవంతంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతోపాటు అంద రూ బాధ్యతతో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మండల కాంప్లెక్స్ ఆవరణలో కొవిడ్ టీకాపై ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాక్సినేషన్పై సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి గ్రామం వందశాతం లక్ష్యం చేరుకోవాలన్నారు. పంద్రాగస్టు వరకు మండలంలోని మూడు గ్రామాలు కచ్చితంగా 100శాతం లక్ష్యా న్ని చేరుకునేటట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలన్నారు.
ఇలాంటి గ్రామాలకు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. డీఎంఅండ్హెచ్వో చందూనాయక్ మాట్లాడుతూ గట్టు మండలంలో వాక్సినేషన్ మందకొడిగా కొనసాగుతుండడం బాధాకరంగా ఉందన్నారు. దీన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మండలంలో వాక్సినేషన్పై అపోహలు ఉన్నాయని, వాటిని పోగొట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. కరోనా వాక్సినేషన్ శాతం పెంచిన కొద్దీ కరోనాను దూరం చేసినవారవుతామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని స్పష్టంచేశారు. కొవిడ్ వాక్సిన్ నాతోపాటు అందరికీ వేయిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్కుమార్, గట్టు, కేటీదొడ్డి జెడ్పీటీసీలు బాసు శ్యామల, రాజశేఖర్, వైస్ ఎంపీపీ మేకల సుమతి, ఎంపీడీవో పాండు, మండల వైద్యాధికారి రాజసింహ, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘కరోనా కట్టడి’ పంచాయతీల ప్రథమ కర్తవ్యం
ధరూరు: ఏప్రిల్ 22: కరోనాను ఖతం చేయడాన్ని పంచాయతీల సర్పంచులు, మిగతా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రథమ కర్తవ్యంగా భావించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. కరోనాపై అవగాహన సదస్సులో భాగంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా వైద్యాధికారి చందూనాయక్తో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ జిల్లాలో కరోనా ప్రభావం తీవ్రంగా పెరుగుతున్నందున పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, స్థానిక నాయకులు చాలా ఆప్రమత్తంగా ఉండి కరోనాను అరికట్టాలన్నారు. ప్రజలందరి ఆరోగ్యం- పంచాయతీల బాధ్యత అనే నినాదంతో అందరూ కలిసికట్టుగా గ్రామంలో పారిశుధ్యాన్ని పెంపొందిస్తూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలన్నారు, ప్రజాప్రతినిధులు టీకా వేయించుకొని అపోహలు తొలగించి ప్రజలందరికీ టీకా అందేలా చూడాలన్నారు.
గ్రామాల వారీగా ప్రభుత్వం ఉచితంగా అందించే కరోనా వ్యాక్సిన్ 100శాతాన్ని ఏ పంచాయతీ అయితే ప్రజలకు అందిస్తుందో ఆ పంచాయతీకి నగదు, ప్రశంసాపత్రంతో ఆగష్టు 15న సన్మానిస్తామన్నారు. మండల ప్రజా ఆరోగ్య సిబ్బందిని సద్వినియోగం చేసుకొని ప్రజల్లో టీకాపై స్వేచ్ఛాయుత వైఖరిని పెంపొందించాలన్నారు. కరోనా రహిత గ్రామ పంచాయతీని నిర్మించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నజుమున్నీసాబేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, మండల వైద్యాధికారి స్రవంతి, ఎంపీడీవో అబ్దుల్ జబ్బార్, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: దూబే, రాహుల్ కీలక ఇన్నింగ్స్..రాజస్థాన్ స్కోర్ 177
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
లక్ష టెస్టులు.. 5 వేలు పాజిటివ్