సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాంకీ ఎన్వీరో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బిగ్ గ్రీన్ గణేశా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ అనుకూల గణేశ్ విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా రాంకీ సీఈవో గౌతమ్రెడ్డి తెలిపారు. 14వ ఎడిషన్లో భాగంగా బిగ్ ఎఫ్ఎంతో కలిసి బయో డీగ్రేడబుల్ విగ్రహాలను కమ్యూనిటీలు, ఉద్యోగులతో కలిసి పంపిణీ చేసే కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈనెల 9వ తేదీ వరకు బిగ్ గ్రీన్ గణేశా కార్యక్రమం కింది మట్టి విగ్రహాలను అందించనున్నట్లు చెప్పారు. సినీ ప్రముఖులు నాని, రావు రమేశ్, ఆర్పీ పట్నాయక్, తనికెళ్ల భరణి, గోపిచంద్, ప్రియమణి, కార్తికేయ, సుధీర్బాబు, ఈషా రెబ్బాలు ఈ పర్యావరణ అనుకూల గణేశ్కు ప్రచారం చేయనున్నట్లు గౌతంరెడ్డి తెలిపారు.